కెజిఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ అటకెక్కినట్లేనా?

  • July 11, 2020 / 12:46 PM IST

సూపర్ ఫార్మ్ లో ఉన్న ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సిద్ధం చేశారు. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా నటిస్తున్న ఆయన, తన తదుపరి చిత్రం దర్శకుడు త్రివిక్రంతో చేయనున్నాడు. దీనిపై ఇప్పటికే ప్రకటన రాగా, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ…దర్శకుడు మరియు నిర్మాతలు కొన్ని హింట్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేశారు.

ఈ చిత్రానికి న్యూక్లియర్ అనే టైటిల్ అంటూ ప్రచారం జరిగింది. ఐతే ఈ మూవీ పట్టాలెక్కడం కష్టమే అన్న మాట విన్పిస్తుంది. దానికి ఆర్ ఆర్ ఆర్ మూవీనే కారణం. ఎన్టీఆర్ మొదట ఆర్ ఆర్ ఆర్ తో పాటు త్రివిక్రమ్ మూవీ కూడా పూర్తి చేద్దాం అనుకున్నాడు. అందుకోసమే ఏప్రిల్ లో త్రివిక్రమ్ మూవీ షూట్ మొదలుపెట్టాలని భావించారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఏర్పడగా…ఎన్టీఆర్ ప్రణాళిక మొత్తం చెడింది. 2021లో ప్రశాంత్ నీల్ మూవీ మొదలుపెట్టాలన్న ఎన్టీఆర్ ఆలోచన ఫెయిల్ అయ్యింది.

ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రం మూవీ పూర్తి చేయడానికి ఎన్టీఆర్ కి చాలా సమయం పట్టేలా ఉంది. వచ్చే ఏడాది చివర్లో కానీ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. కెజిఎఫ్ 2 అక్టోబర్ 23న విడుదల కానుండగా, ఎన్టీఆర్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ఏడాదికి పైగా ఎదురుచూడాల్సి ఉంటుంది. మరి అంత డిమాండ్ ఉన్న దర్శకుడు ఎన్టీఆర్ కోసం ఏడాది ఎదురుచూడం అసంభవం అని కొందరు అంటున్నారు. దీనితో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ రద్దు కావచ్చు, లేదా బాగా ఆలస్యం అవుతుందన్న మాట వినిపిస్తుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus