Jr NTR: కేంద్ర హోంశాఖ మంత్రిని కలవనున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

  • November 3, 2023 / 07:43 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ను త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కలువనున్నారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో శాసనసభ ఎన్నికల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో బిజెపి పార్టీని బలపరచడం కోసం పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికీ జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపితో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కలవబోతున్నారనే విషయం తెలియడంతో ఈ విషయం కాస్త ఆసక్తికరంగా మారింది.

అసలు (Jr NTR) ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడానికి గల కారణం ఏంటి అన్న విషయాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు ఇక ఈ వ్యవహారంపై బాలయ్య స్పందిస్తూ ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం చెప్పారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు సుమారు అరగంట పాటు వీరిద్దరూ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మరోసారి కూడా ఎన్టీఆర్ తో ఈయన భేటీ కానున్నారు అనే విషయం తెలియడంతో తప్పనిసరిగా రాజకీయపరమైన అంశాలను ప్రస్తావించడం కోసమే కలవనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus