వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ భార్య?

  • June 22, 2020 / 03:04 PM IST

ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు.. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తరువాత ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా అడుగులు వేసాడు.ఎన్టీఆర్ కూడా పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ వస్తున్నాడు. మరోపక్క చరణ్ భార్య ఉపాసన, మహేష్ భార్య నమ్రత.. వంటి వారు తమ భర్తలకు సంబంధించిన బిజినెస్ లను చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ భార్య… లక్ష్మీ ప్రణతి కూడా వీరిలానే బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

అసలు విషయం ఏమిటంటే.. లక్ష్మీ ప్రణతి ఓ న్యూస్ మీడియా ను స్థాపించబోతున్నట్టు తెలుస్తుంది. తండ్రి నార్నె శ్రీనివాస్ రావు సాయంతో ఆమె మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ఇప్పుడు జోరుగా ప్రచారం నడుస్తుంది. ‘యువ’ అనే పేరుతో ఈ ఛానెల్ ను మొదలు పెట్టబోతుందట.ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని.. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. మరి ఈ ఛానల్ కు సంబంధించి ‘ఎన్టీఆర్ కూడా ఏమైనా షోలలో పాల్గొంటాడా?..

అసలు ఈ మీడియా ఏ రకంగా తన ప్రత్యేకతను చాటుకుంటుంది?’ అని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ కూడా ‘అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వంలోకి అడుగు పెట్టబోతున్నాడు. తన పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే.. సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నాడని’ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి అసలు సంగతి ఏంటో.. ఎన్టీఆరే చెప్పాలేమో..!

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus