స్టార్ హీరోయిన్ తో మారుతి ప్లాన్!

  • February 13, 2021 / 03:34 PM IST

టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మారుతి. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తర్వాత ఆయన ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు. ఫైనల్ గా గోపీచంద్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టనున్నారు. రేపే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో పాటు మారుతి ఓ వెబ్ సిరీస్ ను కూడా లైన్ లో పెడుతున్నారు. లాక్ డౌన్ లో పలు స్క్రిప్ట్స్ మీద పని చేసిన ఆయన ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాలని అనుకుంటున్నారు.

ఇందులో మెయిన్ లీడ్ గా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్లు సమాచారం. ‘3 రోజెస్’ అనే పేరుతో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నారట. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ఈ సిరీస్ ను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కాజల్ కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించి ఈ సిరీస్ కోసం లాక్ చేసినట్లు సమాచారం. రీసెంట్ గానే కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

హాట్ స్టార్ లో విడుదలైన ఈ సిరీస్ కి ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది. అయితే కాజల్ పెర్ఫార్మన్స్ కి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. తొలిసారి ఆమె బోల్డ్ తరహా క్యారెక్టర్ లో కనిపించి అలరించింది. ఇక తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. అలానే ‘ఇండియన్ 2’ అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus