ఒక్క పాటకు కాజల్ ఎంత తీసుకుందో తెలుసా?

  • August 22, 2016 / 10:50 AM IST

కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ కి ఒప్పుకుని అందర్నీ ఆశ్చర్య పరిస్తే.. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుని ఆమె   అదరగొట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్లో ఆమె “పక్కా లోకల్” పాటలో అందాలు ఆరబోసింది. ఈ పాటను హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో వేసిన డాబా సెట్లో ఐదు రోజులుగా తెరకెక్కించారు. ఇందుకోసం కాజల్ ఇదివరకు వేయని డ్రస్సులు వేసినట్లు సమాచారం.

నేటితో షూటింగ్ పూర్తి అయిందని, తారక్, కాజల్ పోటీ పడి డ్యాన్స్ వేయడంతో పాట అనుకున్న దాని కన్నా బాగా వచ్చిందని, ఇది చిత్రంలో ఒక హైలెట్ కానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ పాటలో మినహా కాజల్ చిత్రంలో ఏ క్యారక్టర్ చేయడం లేదని స్పష్టం చేసింది. అయినా ఈ ఒక్క పాట కోసం ఆమెకు నిర్మాతలు 50 లక్షలు రెమ్యునరేషన్ అందజేశారని వెల్లడించింది. ఇంత మొత్తంలో ఏ టాలీవుడ్ నటి అందుకోలేదు. గబ్బర్ సింగ్  “కెవ్వు కేక” పాట కోసం బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్ కోటి రూపాయలు అందుకొని రికార్డు సృష్టిస్తే.. కాజల్ అరకోటి తీసుకొని తన స్థాయిని చాటింది. ఈ చిత్రంకోసం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఆ పాటలను తెర పైన చూడాలంటే మాత్రం  సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus