మెగా, నందమూరి హీరోల మరో మల్టీస్టారర్ సినిమా

  • March 17, 2018 / 01:51 PM IST

మెగా హీరోలు, నందమూరి హీరోలు కలిసి నటించడం మొన్నటి వరకు కల. ఇప్పుడది సాధ్యం కానుంది. త్వరలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ కాంబో మాదిరిగానే మరో మల్టీస్టారర్ సినిమా మొదలు కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ కలిసి సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరికి దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కథ చెప్పారు. సినిమా ఓకే అనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఇద్దరికీ సూటయ్యే కథ దొరికిందంట. సావిత్రి, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలను దర్శకత్వం చేసిన పవన్ సాధినేని కళ్యాణ్  రామ్ కి రీసెంట్ గా ఓ కథ చెప్పారని తెలిసింది. అందుకు కళ్యాణ్ రామ్ ఓకే అన్నారంటా. మరి ఇందులో మరో హీరో కూడా నటించాలి..

అందుకు తాను ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టమే నని కళ్యాణ్ రామ్ చెప్పడంతో సాయి ధరమ్ తేజ్ కి కథ వినిపించడానికి  పవన్ సాధినేని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ అయితే  ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో  “ఎంఎల్ఏ” సినిమా చేశారు. “మంచి లక్షణాలున్న అబ్బాయి” అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని మార్చి 23న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. అలాగే “నా నువ్వే” సినిమాని కూడా దాదాపు కంప్లీట్ చేశారు. ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి కళ్యాణ్ రామ్ నటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus