నిత్యామీనన్ ని తప్పించడం వెనుక బలమైన కారణం

  • February 13, 2018 / 09:23 AM IST

స్వామిరారా, కేశవా చిత్రాలతో మంచి పేరుతెచ్చుకున్న యువ డైరక్టర్ సుధీర్ వర్మ ప్రస్తుతం కిరాక్ పార్టీ తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత శర్వానంద్ తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ ద్వి పాత్రాభినయం చేయనున్నారు. ఇందులో ఒకటి లవర్ బాయ్ కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. 40 ఏళ్ల శర్వానంద్ పక్కన జోడీగా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను ఫైనల్ చేశారు. అలాగే రెండో హీరోయిన్ గా నిత్యా మీనన్ ని సంప్రదించారు. శర్వానంద్, నిత్యామీనన్ లు హిట్ పెయిర్ గా పేరుంది. అందుకే ఆమెను తీసుకోవాలని చూసారు. కానీ చివరి నిముషంలో ఆ ఛాన్స్ కళ్యాణి ప్రియదర్శి కి వెళ్ళింది.

నిత్యా స్థానంలో కళ్యాణి రావడం వెనుక ఆర్థికపరమైన కారణం ఉందని తెలిసింది. నిత్యామీనన్ 75 లక్షల పారితోషికం డిమాండ్ చేసిందంట. ఇప్పటికే కాజల్ కి భారీ పారితోషికం ఇస్తుండడంతో.. నిత్యాకి అంత ఇవ్వలేక కళ్యాణి ప్రియదర్శన్‌ను ఎంపిక చేశారట. ఆమె 25 లక్షలకే సైన్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ లెక్కన నిర్మాతకు 50 లక్షలు మిగిలింది. పైగా హలో మూవీ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కళ్యాణి… శర్వానంద్ పక్కన సరికొత్తగా కనిపించనుంది. ఈ సినిమా గురించి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus