‘కన్నప్ప’ (Kannappa) సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వాళ్ళ పుషింగ్ ఉంది కాబట్టి.. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. మంచు విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయం.
అయితే ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? అసలు ఓటీటీ డీల్ అయ్యిందా? ఈ విషయాలపై మంచు విష్ణు నేరుగానే మీడియాకి క్లారిటీ ఇచ్చేశాడు. మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ..’కన్నప్ప’ (Kannappa) సినిమా 10 వారాల వరకు ఓటీటీకి రాదు. నేను ఎటువంటి ఓటీటీ డీల్స్ కి కమిట్ అవ్వలేదు.
సో నాకు రిలీజ్ ప్రెజర్ అనేది లేదు. నేను ప్రేక్షకులకి బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలి.. ఇచ్చానా.. ఇవ్వగలుగుతున్నానా? లేదా? ఇది మాత్రమే నాకున్న రిలీజ్ ప్రెజర్. ‘కన్నప్ప’ (Kannappa) విషయంలో నాకు నేను ఆ ఫ్రీడమ్ తీసుకుందామని అనుకున్నాను. దేవుడి దయ వల్ల ఓటీటీ సంస్థల ప్రెజర్ నా సినిమాపై లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.
మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఓటీటీ అగ్రిమెంట్ల వల్ల దర్శకనిర్మాతల్లో రిలీజ్ టెన్షన్ ఉంటుంది. ఇక్కడ మంచు విష్ణుకి అలాంటి టెన్షన్ లేదు. అలాగే సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం కూడా ప్రేక్షకుల పై భారం పెట్టాలని అనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఏరియాల్లో రూ.100 టికెట్ రేటు ఉన్న చోట రూ.150 చేశారు. రూ.50 మాత్రమే పెంచుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు.
కన్నప్ప సినిమా 10 వారాల వరకు ఓటీటీకి రాదు#Kannappa #VishnuManchu #MohanBabu #Prabhas #AkshayKumar #Mohanlal pic.twitter.com/8t70bei4P0
— Filmy Focus (@FilmyFocus) June 26, 2025