మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది ‘కన్నప్ప’ (Kannappa). మంచు విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు దీనికి కథకుడిగా కూడా వ్యవహరించాడు. అలాగే ప్రధాన పాత్ర పోషించాడు.ఈ సినిమాలో విష్ణు తండ్రి.. సీనియర్ స్టార్ నటుడు మోహన్ బాబు (Mohan Babu), అలాగే విష్ణు కొడుకు అవరం భక్త మంచు, కూతుళ్లు అరియానా-వివియానా వంటి వారు కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు.
మంచు విష్ణు (Manchu Vishnu) భార్య విరానికా రెడ్డి కూడా ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. ఈ సినిమా కథ పై విష్ణు 8 ఏళ్ళు వర్క్ చేశాడు. ఇప్పటి జెనరేషన్ కి ‘కన్నప్ప’ (Kannappa) కథ చెప్పాలంటే.. అందులో హైలెట్స్ ఏంటి, ఇప్పటి ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటి.. వంటి అంశాలపై చాలా మంది రైటర్లతో కూర్చుని విష్ణు వర్క్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టుని దాదాపు 3 ఏళ్ళ పాటు కష్టపడి తీశాడు. ఎడతెగకుండా ప్రమోషన్ చేశాడు.
ఫైనల్ గా(జూన్ 27న) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకి, పెద్దలకి సినిమాని చూపించాడు దిల్ రాజు (Dil Raju). ప్రసాద్ ల్యాబ్స్ లో బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ షోలు వేశారు. 3 గంటల సినిమా కాబట్టి… వారికి స్పెషల్ గా భోజనాలు ఏర్పాట్లు చేసి మరీ షోలు వేశాడు. ఇక ‘కన్నప్ప’ (Kannappa) చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్లాక్ వర్కౌట్ అయ్యాయట. హీరోయిన్ ప్రీతి ముకుందన్ గ్లామర్ కూడా యూత్ ని ఆకర్షించే విధంగా ఉంటుందట.
ఇక సెకండాఫ్ లో పావుగంట తర్వాత ప్రభాస్ (Prabhas) ఎంట్రీ ఉంటుందట. అది అందరినీ కథలోకి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడుతుందని, ప్రభాస్ నడక, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయని, దైవత్వం ఉట్టిపడేలా ఉన్నాయని అంటున్నారు.40 నిమిషాల పాటు ఈ పాత్ర ఉంటుందట. మోహన్ లాల్ పాత్ర కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.