జాతిపితను టార్గెట్ చేసిన స్టార్ హీరోయిన్!

  • March 13, 2021 / 12:56 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. తరచూ సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా. ఇటీవల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా నిలిచారు. కానీ కంగనా మాత్రం రైతుల నిరసనను వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేసింది. ఈ విషయంలో ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. తాజాగా కంగనా జాతిపిత మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది. గాంధీని విమర్శిస్తూ ట్విట్టర్ లో ట్వీట్లు చేసింది. మహాత్మా గాంధీ తన సొంత బిడ్డలను వేధించి చెడ్డ తండ్రిగా పేరు తెచ్చుకున్నారని.. తన భార్య అతిథుల టాయిలెట్స్ క్లీన్ చేయలేదని ఆమెని ఇంటి నుండి బయటకి నెట్టేసినట్లు పలు ప్రస్తావనలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఆయన మంచి భర్త, తండ్రి కాకపోయినా.. గొప్ప నాయకుడు కాగలిగాడని.. అది కేవలం పురుషాధిక్యత వలనే సాధ్యమైందని రాసుకొచ్చింది.

ఇప్పటివరకు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెట్టే కంగనా.. ఇప్పుడు ఏకంగా జాతిపితని టార్గెట్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కంగనా ప్రవర్తన రోజురోజుకి మితిమీరిపోతుందని.. ఆమెని ఇలానే వదిలేస్తే సొసైటీకి మరింత ప్రమాదంగా మారుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus