బ్రేక్ ఈవెన్ సాధించిన దుల్కర్ సల్మాన్.. ‘కనులు కనులను దోచాయంటే’..!

Ad not loaded.

‘ఓకే బంగారం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని.. ‘మహానటి’ చిత్రంతో మంచి క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు మన మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. దేసింగ్ పెరియాసామి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కేజ్రీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలయ్యింది. ఏమాత్రం చప్పుడు చేయకుండా వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి వీకెండ్ సో సోగా ఆడిన ఈ చిత్రం.. రెండో వారం నుండీ స్పీడ్ అందుకుంది.

రెండో వారం ఈ చిత్రానికి స్క్రీన్స్ కూడా పెంచారు. ఇక కమర్షియల్ గా చూసుకుంటే.. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 0.80 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి వారం స్లో గా స్టార్ట్ అయిన ఈ చిత్రం కలెక్షన్లు రెండో వారం డబుల్ అయ్యాయనే చెప్పాలి. 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 0.98 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణాలో థియేటర్లు బంద్ అవ్వడం మైనస్ అయ్యింది కానీ లేకపోతే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus