Kareena Kapoor: ”అంత డిమాండ్ చేయడంలో వింతేమీ లేదు”

  • September 11, 2021 / 05:09 PM IST

బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా రూపొందనున్న ఓ సినిమాలో సీత పాత్ర పోషించడానికి నటి కరీనా కపూర్ పన్నెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోరిందనే వార్తలు వినిపించాయి. ఈ విషయంలో నెటిజన్లు కరీనా కపూర్ ను ట్రోల్ చేశారు. కొంతమంది సినీ ప్రియులు కూడా ఈ విషయంలో రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కరీనా స్పందించింది. ఈక్వల్ పే డిమాండ్ ను ఆమె ఈ సందర్భంగా తెరపైకి తీసుకొచ్చింది.

స్త్రీ, పురుషులకు సమానవేతనం అడగడానికి ఈ సందర్భాన్ని తను ఉపయోగించుకుంటున్నట్లుగా కరీనా చెబుతోంది. ఈ విషయంలో మరో మాట లేదని అంటోంది. రామాయణాన్ని సీత కోణంలో చెప్పాలనేది ఆ సినిమా మేకర్ల ఆలోచన అని.. అలాంటప్పుడు ఆ పాత్రే ప్రధానమని.. ఆ ప్రధాన పాత్రను చేస్తున్నప్పుడు పన్నెండు కోట్ల పారితోషికం కోరడంలో వింతేమీ లేదని కరోనా చెప్పుకొచ్చింది. ప్రధాన పాత్రధారికి ఎక్కువ రెమ్యునరేషన్ అయినప్పుడు.. తను ఈక్వల్ పే డిమాండ్ చేయడంలో తప్పేముందని కరీనా ప్రశ్నిస్తోంది.

పన్నెండు కోట్ల పారితోషికం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇలా వివరణ ఇస్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడు ఈక్వెల్ పే నినాదం రేగుతోంది. మరింత మంది హీరోయిన్లు ఈ విషయంపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus