మహేష్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన కత్రినా..!

  • January 31, 2019 / 10:19 AM IST

ప్ర‌స్తుతం ‘మ‌హ‌ర్షి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మహేష్ కి 25 వ చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రం పూర్తవ్వగానే సుకుమార్‌ డైరెక్షన్లో తన 26 వ చిత్రాన్ని లైన్లో పెట్టేసాడు మహేష్. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మార్చి నుండీ సెట్స్ పైకి వెళ్ళ‌నుందని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్… బ్యాక్‌ డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్‌ని స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడ‌ట సుకుమార్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్‌ని ఎంచుకున్నారని గ‌త కొంతకాలంగా వార్త‌లు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది క‌త్రినా. ప్ర‌స్తుతం స‌ల్మాన్ స‌ర‌స‌న ‘భార‌త్’ చిత్రంలో న‌టిస్తున్న క‌త్రినా త‌న నెక్స్ట్ సినిమా ఏంట‌నేది ఇంకా కన్ఫర్మ్ కాలేద‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘మ‌హేష్ తో సినిమా చేస్తున్నానే వార్తల్లో నిజం లేదని…. ఆ చిత్రానికి సంబంధించి తనని ఎవరూ సంప్ర‌దించ‌లేదనీ…. ఒక వేళ నిజంగా మహేష్ తో సినిమా చేసే అవకాశం వస్తే నేను వదులుకుంటానా..’ అంటూ క్లారిటీ ఇచ్చింది కత్రినా..! మరి ‘మహేష్ 26’ లో ఎవరు హీరోయిన్ గా నటించబోతున్నారనేది.. చిత్ర యూనిట్ ప్రకటిస్తేనే కానీ ఓ క్లారిటీ రాదనే చెప్పాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus