విజయమ్మ, భారతి పాత్రల ఎంపికలో చిత్ర బృందం

  • March 23, 2018 / 01:55 PM IST

మహా నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించే పనులు ఊపందుకున్నాయి. మహివి రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న బయోపిక్ లో వైఎస్సార్‌ పాత్రను మలయాళ స్టార్‌ మమ్ముట్టి పోషించనున్నారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే ఇతర పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసేపనిలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ మధ్య రఘువరన్ బీటెక్, 24 సినిమాలో అమ్మగా, అత్తగా ఆకట్టుకున్న శరణ్యను వైఎస్ విజయమ్మ పాత్ర కోసం సంప్రదించినట్టు తెలిసింది.

విజయమ్మ పాత్రకు ఆమె సరిగ్గా సూటవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. అలాగే జగన్ సతీమణి భారతి పాత్రకు కీర్తి సురేష్‌ను సంప్రదించారని సమాచారం. అయితే వారు ఒప్పుకున్నారా? లేదా? అనేది మాత్రం ఇంకా బయటికిరాలేదు. ఇక జగన్ పాత్రను ఎవరు పోషిస్తారు ? అనే విషయం అందరినీ ఆసక్తి కలిగిస్తోంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి “యాత్ర” అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు చిత్రబృందం వెల్లడించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus