Keerthy Suresh: బాలీవుడ్‌ రీమేక్‌కు కీర్తి సురేశ్‌ ఓకే చెప్పిందట!

  • August 30, 2021 / 04:39 PM IST

సినిమా కోసం బరువు తగ్గాలి… మన హీరోయిన్లు ఈజీగా ఒప్పేసుకుంటారు. డైట్‌లు పాటించి, జిమ్‌ల్లో కష్టపడి సన్నబడతారు. అదే బరువు పెరగాలి అంటే అది కూడా అంతే ఈజీగా తీసుకునేవారు. అయితే ఇది ఒకప్పుడు. ‘సైజ్‌ జీరో’ కోసం అనుష్క బరువు పెరిగిన తర్వాత పడ్డ ఇబ్బందులు చూసి చాలామంది నాయికలు ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు కీర్తి సురేశ్‌ ఇదే సంకట పరిస్థితిలో ఉందట. అవును ఆమె తన తర్వాతి సినిమాకు బరువు పెరగాల్సి ఉంటుందట.

కీర్తి ఈ ఆలోచన అంతా. బాలీవుడ్‌ సినిమా రీమేక్‌ గురించే. అవును కృతి సనన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘మిమీ’ సినిమాను తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనికి సంబంధించి కీర్తి సురేశ్‌ను ఇప్పటికే చిత్రబృందం సంప్రదించిందట. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. త్వరలో ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. దీంతో బరువు అంశం బయటికొచ్చింది. ‘మిమీ’ కోసం కృతి సనన్‌ బరువు పెరిగిన విషయం తెలిసిందే.

గర్భవతిగా కనిపించాల్సిన సన్నివేశాల కోసం కృతి ఆ పని చేసింది. మరిప్పుడు కీర్తి సురేశ్‌ ఇలాంటి పని చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే కీర్తి తొలినాళ్లలో బొద్దుగా ఉండేది. అయితే ఆ తర్వాత సన్నబడింది. ఇప్పుడు కాస్త పర్ఫెక్ట్‌ షేప్‌లోకి వస్తోంది. ఈ సమయంలో మళ్లీ లావెక్కడం అంటే ఆరోగ్యపరంగా, కెరీర్‌ పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus