టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించనున్న మలయాళ బ్యూటీ

  • November 22, 2016 / 12:19 PM IST

ఈ ఏడాది జనవరి ఫస్ట్ న విడుదలైన నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు వారి మనసు దోచుకున్న నటి కీర్తి సురేష్. ఈ మలయాళ బ్యూటీ ఈ ఒక్క చిత్రంతోనే టాలీవుడ్ హీరోల దృష్టిలో పడింది. తెలుగు నుంచి అనేక అవకాశాలు వచ్చినా.. అప్పటికే మూడు తమిళ చిత్రాలకు సైన్ చేయడంతో కీర్తి కొన్ని తెలుగు సినిమాలను వదులుకుంది. త్వరలో నాని తో కలిసి “నేను లోకల్” చిత్రంతో పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మపై టాలీవుడ్ అగ్ర హీరోలు మనసుపడ్డారని, ఆమెతో కలిసి నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తాజాగా తెలిసింది. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుబట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న కొత్త సినిమాలో కథానాయికగా సెలక్ట్ చేసినట్లు సమాచారం.

పవన్ సరసన నటిస్తుస్తున్నట్లు కీర్తి కూడా అధికారికంగా ఈ మధ్యనే ప్రకటించింది. ఇక ఆమెను కోరుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారంట. కొరటాల కాంబినేషన్లో రానున్న మూవీలో కీర్తిని హీరోయిన్ గా ఎంపిక చేయమని ప్రిన్స్ చెప్పడంతో.. ఆ పనిలో నిర్మాత డీవీవీ దానయ్య ఉన్నట్లు సమాచారం. “భరత్ అను నేను” అనే పేరు అనుకుంటున్నా ఈ  సినిమాకు ప్రధాన హీరోయిన్ గా కీర్తి ఖరారు అయ్యేట్టు ఉందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.  ఇలా ఆమె కోసం ప్రయత్నిస్తున్న టాలీవుడ్ హీరోల జాబితా పెద్దదిగానే ఉందని వారు చెవులుకొరుక్కుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus