కీర్తి సురేష్ నోరుజారడంతో సమంత గురించి తెలిసింది!

  • December 1, 2017 / 01:14 PM IST

తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేని పేరు సావిత్రి. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు మహానటి పేరు నిలిచిపోతుంది. ఆమె జీవితం ఆధారంగా ప్రస్తుతం సినిమా రూపుదిద్దుకోనుంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ సావిత్రి నిజ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. “మహానటి” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది.  వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి గా నటించనుంది.

ఇందులో సమంత, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, క్రిష్ తదితరులు నటిస్తున్నారు. సమంత ఈ మూవీలో కథను ముందుకు నడిపే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కీర్తీ సురేష్ అనుకోకుండా సమంత పాత్రను రివీల్ చేసింది. మీడియాతో మాట్లాడుతూ, జమునగా సమంత అద్భుతంగా నటించిందంటూ నోరు జారింది. దీంతో సమంత ఆ పాత్రలో కనిపించనుందని తెలిసింది. సో ఈ సినిమాలో అలనాటి టాప్ హీరోయిన్స్ మధ్య జరిగిన సంఘర్షణను వెండితెరపై సినీ అభిమానులు చూడనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus