‘సర్కారు వారి పాట’ లో కీర్తి సురేష్ ఫిక్స్?

  • June 17, 2020 / 12:45 PM IST

మహేష్ బాబు 27వ చిత్రాన్ని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్టు… ఈ మధ్యనే అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఇప్పుడు షూటింగ్ లకు పర్మిషన్ దొరికినప్పటికీ… వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో 3 నెలల వరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టొద్దు అని మహేష్ బాబు చెప్పాడట.

దీంతో నిర్మాతలు ప్రీ ప్రొడక్షన్ పనులను ముమ్మరం చేసారట. ఇందులో భాగంగా హీరోయిన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మొదట ఈ చిత్రం కోసం కియారా అద్వానీని తీసుకోవాలి అనుకున్నారట. కానీ ఆమె వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తరుణంలో … ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తుంది. దీంతో కీర్తి సురేష్ ను కూడా సంప్రదించారట. మొదట ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

దీంతో మళ్ళీ కియారా నే ఈ చిత్రంలో తీసుకోవాలి అని.. ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారట. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టిందని సమాచారం. ఈ క్రమంలో కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు కీర్తి ఇప్పుడు పారితోషికాన్ని కూడా తగ్గించుకున్న నేపధ్యంలో ఈమెనే ఫైనల్ చేసినట్టు సమాచారం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus