ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీ, వేదికల్లో మార్పు

Advertisement

మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన150వ చిత్రం ‘ఖైదీ నెం150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగే వేదిక మారింది. ఈనెల 4 వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చిత్ర నిర్మాత రామ్ చరణ్ తేజ్ కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా వేదిక, తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ కార్యక్రమం ఈ నెల 7 తేదీకి పోస్ట్ పోన్ చేశారు. మంగళగిరి లోని హాయ్ ల్యాండ్ లో ఈ ఫంక్షన్ నిర్వహించాలని చిత్ర బృందం డిసైడ్ అయింది. ఇందుకుగల కారణం ఇంకా తెలియరాలేదు. ఎక్కువమంది అభిమానులు వస్తే ఎటువంటి ఇబ్బందికలగకుండా ఉండాలనే వేదిక మార్చారని, వీకెండ్ అయితే అందరికీ అనువుగా ఉంటుందనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెగాస్టార్ సన్నిహితులు వెల్లడించారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు చిరు అభిమానులను ఉర్రుతలూగిస్తున్నాయి. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. తమిళ హిట్ చిత్రం కత్తి కి రీమేక్ అయిన ఖైదీ నెం150’  సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news