మీటూ వల్ల మార్పేమీ రాలేదంటున్న హీరోయిన్..!

  • March 11, 2020 / 05:25 PM IST

మీటూ.. ఈ పదం వినీ వినీ.. చాలా మందికి బోర్ కొట్టేసి ఉండచ్చు… ఈ ఉద్యమం కూడా పాతదై పోయింది.. అని కూడా అనుకోవచ్చు. కానీ ఇంకా అప్పుడప్పుడు ఈ పదం చప్పుడు చేస్తూనే ఉంది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాతో మొదలైన ఈ ఉద్యమం.. అప్పట్లో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. సౌత్ కు చెందిన హీరోయిన్లందరూ కూడా… ‘తాము ఎదుర్కొన్న లైంగిక దాడులను, వేధింపుల్లను’ గురించి మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ చెప్పుకొచ్చారు. అటు తరువాత ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు అని అంతా భావించారు. అయితే ఇటీవల కియారా అద్వానీ ‘మీటూ’ పై చేసిన కామెంట్స్ పెద్ద అనుమానాలకు అలాగే చర్చలకు దారి తీస్తున్నాయి.

కియారా మాట్లాడుతూ… “మీటూ వల్ల కొత్తగా మార్పులేమీ రాలేదు. మీటూ తర్వాత ప్రపంచం కొంచెం కూడా మారలేదు. మనం ఇంకా మీటూ తర్వాతి దశకు కొంచెం కూడా చేరుకోలేదు. దాని వల్ల ఫలితం ఉంటుందన్న ఆశ కూడా లేదు” అంటూ చెప్పుకొచ్చింది కియారా. ఈమె చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే ఇంకా లైంగిక వేధింపులు నటీమణుల మీద జరుగుతున్నాయా..? లేక కియారా ఇంకా ఇలాంటివి ఫేస్ చేస్తుందా అనే విశాల పైనే ఇప్పుడు తెగ చర్చ జరుగుతుంది.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus