రణబీర్ కు మిస్డ్ కాల్స్ ఇస్తున్న సంజయ్ భార్య!

  • October 18, 2017 / 04:54 PM IST

సంజయ్ దత్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో “సంజయ్ దత్” బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సంజయ్ దత్ గా రణబీర్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతి త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలో హీరోగా నటించిన రణబీర్ కపూర్ కి కొన్ని రోజులుగా ఒక ప్రయివేట్ నెంబర్ నుండి రోజుకి పదిహేను పైగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయట. ఎవర్రాబాబు తెగ మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు, రిటర్న్ కాల్ చేస్తే ఎత్తడంలేదు అని రణబీర్ ఆరా తీయగా.. నెంబర్ ఎవరిదో తెలిసేసరికి షాక్ అయ్యాడట. ఆ నెంబర్ సంజయ్ దత్ సతీమణి మాన్యతా దత్ ది.

ఆవిడెందుకు అన్నిసార్లు కాల్ చేసిందా అని ఎంక్వైరీ చేస్తే.. “సినిమా ఔట్ పుట్ ఎలా వచ్చిందో కనుక్కుందామని కాల్ చేసిందట”. కానీ సిగ్గుతో కూడిన భయంతో మాట్లాడకుండా పెట్టేసిందట. ఈ విషయం తెలిసిన సంజయ్ దత్ అదేదో నన్నడగొచ్చు కదా అనగా.. “మిమ్మల్ని కానీ.. హీరానీ గారిని కానీ అడగడానికి కాస్త భయమేసింది, అందువల్ల రణబీర్ కు కాల్ చేసి అడుగుదామనుకొన్నాను” అని సమాధానమిచ్చిందట. అదండీ రణబీర్ మిస్డ్ కాల్స్ స్టోరీ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus