Mahesh Babu, Pawan Kalyan: పవన్- మహేష్ లు ఒకే ఫ్రేమ్లో.. రచ్చ రచ్చే..!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం విశేషం. ఒరిజినల్ తో పోలిస్తే ఆయన ఈ సినిమాలో చాలా మార్పులు చేసాడని నిర్మాత నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Click Here To Watch

అసలు ఈ చిత్రం చూస్తే ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ గుర్తుకు రాదని… ‘అజ్ఞాతవాసి’ ప్లాప్ ను కూడా మర్చిపోయేలా ఈ చిత్రం చేస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల కాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ విడుదల తేదీ పై అందరికీ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఫిబ్రవరి 25నే ఈ మూవీ విడుదల కాబోతుందని ‘భీమ్లా’ టీం చాల కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఫిబ్రవరి 20 లేదా ఫిబ్రవరి 21న ‘భీమ్లా’ ప్రీ రిలీజ్ వేడుకని నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ వేడుకకి ముఖ్య అతిథిలుగా మహేష్ బాబు, రాజమౌళి విచ్చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మహేష్ బాబు తర్వాతి మూవీ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే చేయాల్సి ఉంది. దానికి త్రివిక్రమే దర్శకుడు కాబట్టి.. మహేష్ ఈ వేడుకకి హాజరుకాబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక మహేష్ తో రాజమౌళి ఓ మూవీ చేయబోతున్నాడు. అదీ కాక రాజమౌళి ప్రతీ పెద్ద సినిమా వేడుకకి అతిథిగా వెళ్లడం ఒక ఆనవాయితీగా కూడా మారింది.

ఏది ఏమైనా వీళ్ళిద్దరూ కనుక గెస్ట్ లుగా వస్తే.. సినిమాకి మరింత అట్రాక్షన్ చేకూరుతుంది. దాంతో పాటు మహేష్- పవన్ లను కలిసి చూడాలని వీళ్ళ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయం పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. హైదరాబాద్లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరుగనుందని సమాచారం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus