మైత్రి మూవీ మేకర్స్ నుండి మహేష్ కి బారి ఆఫర్..?

  • March 11, 2020 / 11:49 AM IST

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సూపర్ ఫార్మ్ లో ఉన్నారు. ఆయన వరుసగా మూడు విజయాలు అందుకున్నారు. ఈ సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు మిక్స్డ్ టాక్ లో కూడా మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. వంద కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ మూవీ టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 గ్రాసర్ గా ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ సైతం భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన 50 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ మహేష్ కి ఓ భారీ ఆఫర్ ఇచ్చారట.

మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో ఒకరైన నవీన్ ఎర్నేని మహేష్ బాబుని కలవడం జరిగిందట. సరిలేరు నీకెవ్వరు మూవీ అనంతరం మహేష్ కుటుంబంతో కలిసి న్యూ యార్క్ వెళ్లారు. అక్కడ నవీన్ మహేష్ ని కలవడంతో పాటు, తమ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ చేయాలని భారీ ఎమౌంట్ ఆఫర్ ఇచ్చారట. ఆయన ప్రస్తుతం మహేష్ డిమాండ్ చేస్తున్న దానికి కొంచెం ఎక్కువగానే ఆఫర్ చేశారని టాక్. ఇక మైత్రి మూవీ మేకర్స్ తమ మొదటి చిత్రం మహేష్ తో శ్రీమంతుడు తెరకెక్కించారు. ఆ తరువాత వారు చేసిన జనతా గ్యారేజ్, రంగస్థలం భారీ హిట్స్ అందుకున్నాయి. తాజాగా వారు బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో ఓ మూవీ చేస్తున్నారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus