టాలెంటెడ్ డైరెక్టర్ ను ఫైనల్ చేసిన మహేష్

Advertisement

నటుడుగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన పరశురామ్ (బుజ్జి) ఆ తరువాత డైరెక్టర్ గా మరి ‘యువత’ ‘ఆంజనేయులు’ ‘సోలో’ ‘సారొచ్చారు’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసాడు. రైటర్ గా.. డైరెక్టర్ గా మంచి మార్కులు తెచ్చుకున్న పరశురామ్.. గతేడాది ‘గీత గోవిందం’తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూల్ చేసింది. ‘గీత గోవిందం’ చిత్రం అంత పెద్ద విజయం సాధించడంతో డైరెక్టర్ పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ కథ వినిపించాడు. లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పగా.. కొంచెం టైం తీసుకుని ఈమధ్యే మహేష్ వద్దకు వెళ్ళి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడట. మహేష్ కు కథ నచ్చడంతో వెంటనే సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నాడట. ఈ చిత్రంతో కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. కొరటాలకు నిర్మాణం పై ఎంతో ఆసక్తి ఉన్నట్లు గతంలో చాలా సార్లు తెలిపాడు. ఇక మహేష్ తో కొరటాలకి మంచి అనుబంధం ఉంది కాబట్టి…. మహేష్ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలన్నీ కొరటాలకి అప్పగించాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రానికి మహేష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని కూడా సమాచారం. ఏదైతేనేం.. మహేష్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news