తమన్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!

  • January 21, 2020 / 07:43 PM IST

మొత్తానికి సంక్రాంతి పోరు ముగిసింది. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ … బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే ‘సరిలేరు’ కంటే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయి అనే డిస్కషన్ లు జరుగుతున్నాయి. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ చూస్తారు.. అందులోనూ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయ్యింది. అలా అని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మంచి ఆడియో ఇవ్వలేదా అంటే .. అది సబబు కాదు.

దేవి తనవంతు న్యాయం చేసాడు. కానీ ‘అల వైకుంఠపురములో’ ఆడియో పెద్ద హిట్ అయ్యింది. అందుకే తమన్ సంక్రాంతికి సక్సెస్ అయ్యాడు. అలా అని ప్రతీ చిత్రానికి అతను ఇదే స్థాయిలో సంగీతం అందిస్తున్నాడా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. ఇక అసలు విషయానికి వస్తే.. మహేష్ 27 వ చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడుగా ఎంపికైనట్టు కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్ని తమన్.. తనే అందరికీ చెప్పుకుంటున్నాడని తెలుస్తుంది. నిజానికి ఈ చిత్రానికి దేవి శ్రీ నే సంగీతం అందిస్తున్నాడని.. అందులో ఏ మార్పు లేదని కూడా సమాచారం అందుతుంది. ఇటీవల వైజాగ్ లో జరిగిన ‘అల వైకుంఠపురములో’ విజయోత్సవ వేడుకలో ఇండైరెక్ట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం పై సెటైర్లు వేసాడు తమన్. దీంతో మహేష్ అభిమానులు ఆయన పై మండిపడుతున్నారు.’ ‘దూకుడు’ చిత్రానికి మహేష్ ఛాన్స్ ఇచ్చిన సంగతి ఎలా మరిచిపోయావ్ తమన్’. మహేష్ తరువాతి చిత్రానికి తమన్ వద్దు.. దేవి అన్నే కావాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus