Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

  • September 1, 2021 / 07:20 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గత మూడు సినిమాలు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఒక సినిమాను మించి మరో సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పరశురామ్ సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాతో అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్ బాబు ఇప్పటివరకు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లను ఎప్పుడూ సాధించలేదు. గతంలో దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న మహేష్ కు 1 నేనొక్కడినే రిజల్ట్ షాకిచ్చించి. అయితే మహేష్ ప్రస్తుతం మళ్లీ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడంతో సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోవాలని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సర్కారు వారి పాటతో మహేష్ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రిలీజైతే మాత్రం సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది. సర్కారు వారి పాటపై ఇప్పటికే రిలీజైన టీజర్ భారీగా అంచనాలను పెంచేయడం గమనార్హం. గతంలో సంక్రాంతికి రిలీజైన మహేష్ బాబు సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus