Mahesh Babu: స్టార్ హీరో మహేష్ ప్లాన్ ఇదేనా?

  • August 16, 2021 / 08:50 AM IST

స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా ఈ నెల 9వ తేదీన విడుదలైన సర్కారు వారి పాట టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మహేష్ బాబు ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించినున్న సంగతి తెలిసిందే. అయితే పరశురామ్ కు మహేష్ బాబు టార్గెట్ ఇచ్చారని 45 రోజుల్లో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేయాలని షరతు విధించారని సమాచారం.

యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొనాలని మహేష్ బాబు భావిస్తున్నారని భోగట్టా. ప్రస్తుతం గోవాలో ఫైట్ సీన్లను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ మరో లుక్ లో కనిపించనున్న నేపథ్యంలో సర్కారు వారి పాట పూర్తైన తర్వాతే మహేష్ త్రివిక్రమ్ సినిమాకు డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాను కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారు.

వచ్చే ఏడాది మహేష్ రాజమౌళి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మహేష్ ఇచ్చిన టార్గెట్ లోపు పరశురామ్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారో లేదో చూడాల్సి ఉంది. జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమా రిలీజయ్యేలా మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus