క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని కలిసి దైర్యం చెప్పిన మహేష్..!

  • March 16, 2019 / 07:22 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా అయిన ‘మహర్షి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతున్నాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మే 9 న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా మహేష్ అప్పుడప్పుడు కొన్ని సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత… ఈ పనులన్నిటినీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తాజగా మహేష్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని కలిసాడు.

శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి(12) అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ చిన్నారికి మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట. ఈ విషయం తెలుసుకున్న మహేష్.. స్వయంగా శ్రీకాకుళం వెళ్ళి… పర్వీన్‌ని కలిసి కొంత సమయం గడిపాడు. పర్వీన్ త్వరగా కోలుకోవాలని తనకి దైర్యం చెప్పాడట. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న వెంకటేష్ కూడా ఓ క్యాన్సర్ పేషెంట్ ని కలిసాడు. మహేష్ – వెంకటేష్ లు అన్నదమ్ములు లాగా కలిసుంటారన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కూడా తీశారు. ‘మొన్న పెద్దోడు .. ఈరోజు చిన్నోడు’… అంటూ సోషల్ మీడియా కొందరు కామెంట్లు పెడుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus