మహేష్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ థీమ్ అదేనా?

  • July 26, 2020 / 12:40 PM IST

2011 లోనే మన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు .. ‘చరణర్జున్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించి పెట్టుకున్నారు. దాంతో ఈ టైటిల్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. అల్లు అర్జున్ ల మల్టీ స్టారర్ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం పై అల్లు అర్జున్ ను ప్రశ్నించగా.. ‘కేవలం ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్నాం. అంతే తప్ప… ఇప్పట్లో అలాంటి మల్టీ స్టారర్ గురించి ఆలోచన లేదు’ అని చెప్పాడు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం..

అరవింద్ గారు ‘చరణర్జున్’ స్క్రిప్ట్ కూడా రెడీ చేయించారని.. కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఉంటుందని కొన్నాళ్ల పాటు ప్రచారం జరిగింది. తరువాత అందరూ మర్చిపోయారనుకోండి. అయితే ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయించి మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో ఆ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని అల్లు అరవింద్ గారు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. చరణ్, బన్నీ లతో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు.ఒకవేళ ఆ ఇద్దరి హీరోలతో చేయించాలి అనుకున్నా.. ఆల్రెడీ ఈ ఇద్దరూ ‘ఎవడు’ చిత్రంలో కనిపించారు. కాబట్టి.. కాంబినేషన్ అంత ఫ్రెష్ గా ఉండదు అని అరవింద్ గారు భావిస్తున్నారట.

అందులోనూ ఇద్దరూ మెగాహీరోలే..! అందుకే మహేష్, ఎన్టీఆర్ లతో ఈ ప్రాజెక్టు రూపొందిస్తే కచ్చితంగా కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుంది అని అతని ఆలోచన. అందుకే ఈ ఇద్దరు స్టార్ హీరోల ఇమేజ్ ను బ్యాలన్స్ చేసే దర్శకుడు గురించి కూడా అల్లు అరవింద్ గారు గాలిస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశం ఉందని వినికిడి. మరేమవుతుందో చూడాలి.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus