‘మహానటి’ కి మహేష్ రిక్వెస్ట్ ఆ బయోపిక్ కోసమేనా?

  • August 24, 2020 / 10:10 PM IST

2016 లో రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్… మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక తరువాత చేసిన ‘నేను లోకల్’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలోనే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఈమె స్టార్ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఇక ఈ క్రమంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం… అందులోనూ ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రస్తుతం ఈమె మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇదిలా ఉండగా… సీనియర్ నటుడు నరేష్ తన తల్లి అయిన దివంగత దర్శకురాలు మరియు నటి అయిన విజయ నిర్మల బయోపిక్ ను తెరకెక్కించాలి అని భావిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో విజయ నిర్మల గారి పాత్రకు కీర్తి సురేష్ అయితేనే న్యాయం చేస్తుంది అని నరేష్ భావిస్తున్నాడట. అయితే ‘ ‘మహానటి’ తో తనకి వచ్చిన క్రేజ్ ను బట్టి మరో బయోపిక్ చేసి ఆ ఇమేజ్ ను పాడుచేసుకోలేను. కాబట్టి నేను ఇక నుండీ ఎటువంటి బయోపిక్ లోనూ నటించను’ అంటూ కీర్తి సురేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

దాంతో నేరుగా నరేష్ … కీర్తి ని అడిగితే నో చెప్పే అవకాశం ఉంది. అందుకే మహేష్ తో కీర్తి ని అడిగిస్తే ఓకే అనే అవకాశం ఉందని నరేష్ భావిస్తున్నాడట. ఇదే విషయాన్ని ఇటీవల మహేష్ కు కూడా చెప్పినట్టు వినికిడి. త్వరలోనే ఈ విషయం పై మహేష్.. కీర్తి తో మాట్లాడే అవకాశం ఉంది. మరి ఆవిడ మహేష్ మాట విని ఓకే అంటుందో లేదో.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus