ఎటువంటి గొడవ రాకుండా వీడియో కాల్ లో సెటిల్మెంట్ చేసేసిన సూపర్ స్టార్..!

  • March 30, 2020 / 02:56 PM IST

సూపర్ స్టార్ మహేష్ … మిగిలిన హీరోలతో పోలిస్తే చాలా ప్రత్యేకతలు చూపుతూ ఉంటాడు. సినిమాల కథల విషయంలోనే కాదు… మొహమాటం లేకుండా నో అని చెప్పడంలో వెనకడుగు వెయ్యడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా కూల్ గా దానిని డీల్ చేసి ఎటువంటి కాంట్రవర్సీ అవ్వకుండా చూసుకుంటాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ … వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ కథ నచ్చలేదని నో చెప్పేసాడు. వంశీ తో మహేష్ కు మంచి స్నేహం ఉంది.

అలా అని సినిమా చెయ్యను అని చెప్పలేదు… మంచి కథ డెవలప్ చెయ్యి చేద్దాం అని సున్నితంగా చెప్పి తప్పించుకున్నాడు. ఈ నేపధ్యంలో పరశురామ్ (బుజ్జి) తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. కానీ పరశురామ్ ఆల్రెడీ ’14 రీల్స్’ వారితో ఓ ప్రాజెక్ట్ చెయ్యడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు. మహేష్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి.. పరశురామ్ … ’14 రీల్స్’ వారికి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పాడట. కానీ వారు ఒప్పుకోలేదు.

ఇక్కడ మహేష్ తో పరశురామ్ సినిమా చెయ్యాలి అంటే.. అది ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో చెయ్యాలి. దీంతో విషయం తెలుసుకున్న మహేష్ ఇద్దరి నిర్మాతలకి వీడియో కాల్ చేసి.. కలిసి నిర్మించమని కోరాడట. దీంతో వారు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నాగ చైతన్య కి కూడా అన్యాయం జరుగకూడదు అని చెప్పి …మరో పెద్ద డైరెక్టర్ తో కుదిరితే అదే స్క్రిప్ట్ ను తెరకెక్కించే ప్రయత్నం చెయ్యమన్నాడట. అంతే మ్యాటర్ సింపుల్ గా ఫినిష్ అయిపొయింది. ఇక మహేష్ -పరశురామ్ ప్రాజెక్ట్ … టైటిల్ అలాగే అనౌన్స్మెంట్ మే 31 న వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video


ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus