Sarkaru Vaari Paata Teaser: సూపర్ డూపర్ బ్లాస్టర్ ఇది.. ఇట్స్ మహేష్ షో..!

  • August 9, 2021 / 02:19 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’ .’మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మది సినిమాటోగ్రఫర్ కావడం విశేషం. ఈ ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం నుండీ ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ పేరుతో ఓ టీజర్ ను విడుదల చేసారు.

ఇందుములంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ వేలం పాట ప్రకటన డైలాగ్ తో టీజర్ మొదలైంది.అటు తర్వాత ‘ఇఫ్ ఏ టైగర్ టేక్స్ ఎ రేబిట్’ అంటూ మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. అటు తర్వాత మహేష్ కి దిష్టి తీస్తూ కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది. ‘ ఏమయ్యా కిషోర్ … ఓ ఐదారు మూరలు ఉండవా అవి’ అంటూ మహేష్ పలికే డైలాగ్ ఆకర్షిస్తుంది. మొత్తంగా ఈ టీజర్ కి మహేష్ బాబు లుక్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.

అటు తర్వాత మహేష్ ను అంత గ్లామర్ గా చూపించిన మది సినిమాటోగ్రఫీ, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్ ను చెప్పుకోవచ్చు. మహేష్ ఈ టీజర్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.ఇప్పుడు అతను 46 ఏళ్ళ వయసులోకి ఎంటర్ అవుతున్నా 25 ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఓవరాల్ గా ఈ బ్లాస్టర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus