డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్న మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పండగే..!

Ad not loaded.

మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ చిత్రం షూటింగ్ ను నవంబర్ నుండీ అమెరికాలో మొదలుపెట్టాలని నిర్మాతలు భావించారు. కానీ చిత్ర యూనిట్ సభ్యులకు వీసాల సమస్య తలెత్తడంతో … ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఫోన్ చేసి కాల్ షీట్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పారట దర్శక నిర్మాతలు.

దీంతో ఈ చిత్రం ఆగిపోయినట్టే అనే ప్రచారం మొదలైంది.అంతేకాదు మహేష్ కూడా ఈ చిత్రాన్ని పక్కనపెట్టేసి త్రివిక్రమ్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాలి అని భావిస్తున్నాడని కూడా టాక్ నడిచింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదు.2021 జనవరి 2 లేదా సంక్రాంతి పూర్తయిన తరువాత ‘సర్కారు వారి పాట’ షూటింగ్ అమెరికాలో మొదలుకానుందట. ఈ లోపు మహేష్ బాబు- త్రివిక్రమ్ ల సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదా…

ఆ చిత్రం షూటింగ్ మొదలుపెట్టడం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏమైనా ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు పెద్ద సినిమాలను మొదలుపెట్టడం అంటే డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ‘అతడు’ సినిమా వరకూ మహేష్ బాబు ఒకేసారి రెండేసి సినిమాల్లో నటిస్తూ వచ్చేవాడు. కానీ ఆ చిత్రం తరువాత అతను పెద్ద స్టార్ అయ్యాడు. అప్పటి నుండీ ఇలా రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొన్నది లేదు.ఏమైనా ఆయన ఫ్యాన్స్ కు అయితే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus