మెగా ఫోన్ పట్టిన మంజులకు విషెష్ చెప్పిన మహేష్ బాబు
- May 10, 2017 / 07:32 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల నటిగా నిరూపించుకుంది. షో, కావ్యాస్ డైరీ సినిమాలు మంచి నటిగా పేరు తెచ్చి పెట్టాయి. అలాగే నిర్మాతగా మారి తెరకెక్కించిన నాని నిరాశపరిచినప్పటికీ పోకిరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఆమె మెగా ఫోన్ అందుకుంటోంది. డైరక్టర్ గా సినిమా తెరకెక్కనుంది. సందీప్ కిషన్, త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ నేడు ఫిల్మ్ నగర్ ఆలయంలో ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అర్బన్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్, సంజయ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అక్కకి ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకురాలిగా విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. ఈ సినిమా త్వరలో గోవాలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















