ఇలా టైటిల్ వచ్చింది.. అప్పుడే కథ చెప్పేస్తున్నారు..!

  • May 31, 2019 / 02:16 PM IST

తాజాగా మహేష్ 26 టైటిల్ ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ చిత్ర యూనిట్ విడుదల చేసింది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కూడా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ ముందు నుండీ ప్రచారంలో ఉన్నదే.. ఇప్పుడు కన్ఫామ్ చేసారు అంతే.ఏదైనా మహేష్ కు ఇది సరైన టైటిల్ అనడంలో సందేహం లేదు. ఇలా ఈ టైటిల్ బయటకు వచ్చిందో లేదో అపుడే ఈ చిత్రం కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలైపోయాయి.

వాటిని పరిశీలిస్తే.. టైటిల్ లోగో ప్రకారం… ఈ చిత్రం మిలిటరీలో ప్రారంభం అవుతుందట. అక్కడ మహేష్ ప్రాణ స్నేహితుడు చనిపోతే.. ఆ స్నేహితుడి ఫ్యామిలీ దగ్గరకి మహేష్ వస్తాడు. ఆ ఫ్యామిలీ ఉండే ప్రాంతం రాయలసీమ. అక్కడ తన స్నేహితుడి ఫ్యామిలితో పాటూ.. ఊరు కూడా ఓ విలన్ కి భానిసగా ఉంటుంది.

ఇలాంటి క్రమంలో ఆ హీరో తన స్నేహితుడి ఫ్యామిలీని, అలాగే ఆ ఊరి జనాన్ని ఎలా ఆ విలన్ భారినుండీ విడిపించాడు అనేది ఈ చిత్ర కథాంశం అని చెప్పుకొస్తున్నారు.ఈ చెప్పుడు కథ వింటుంటే.. మహేష్ ‘అతడు’ ‘ఖలేజా’ ‘మహర్షి’ చిత్రాలు గుర్తొస్తున్నాయి. ఏమైనా కమర్షియల్ ఎలెమెంట్స్ విషయాల్లో మాత్రం అనిల్ ఏమాత్రం నిరాశపరచడు అని మహేష్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే 2020 జనవరి వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఇలాంటి కథనాలు మరెన్నో వస్తాయి అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus