వినూత్నంగా ఫైట్ చిత్రీకరిస్తున్న వంశీ పైడిపల్లి

  • July 31, 2018 / 11:45 AM IST

భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఉత్సాహంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. అమెరికాలో సెటిల్ అవుదామని అనుకున్న ఓ విద్యార్థి.. ఇక్కడి రైతుల కష్టాలను తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం రంగంలోకి దిగుతారని తెలిసింది. అంతకంటే ముందు నియమాలు తప్పిన తోటి విద్యార్థులతో ఫైట్ కి దిగినట్లు సమాచారం. రొటీన్ గా కాలేజీ గ్రౌండ్ లో స్టూడెంట్స్ గొడవ పడితే బాగుండదని కొత్తగా ప్లాన్ చేశారు.

క్రికెట్ ఆడుతూ ఉండగా .. రెండు వర్గాలమధ్య గొడవ.. అది ఫైటింగ్ కి దారితీయడం… ఈ యాక్షన్ సీన్ ని విజిల్స్ వేయించేలా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ ఫైట్ పూర్తి అయిన వెంటనే గోవాకి వెళ్లనున్నారు. అక్కడ రెండు పాటలను తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత భారీ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. అల్లరి నరేష్ కీలకరోల్ పోషిస్తోన్న ఈ చిత్రానికి “రాజసం”, “రైతుబిడ్డ” అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ ని ఆగస్టు 9 న రివీల్ చేయనున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus