ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి..!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో షాక్ కు గురైన ఇండస్ట్రీ ఇంకా కోలుకోక ముందే సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన ఇంకొంతమంది నటీనటులు మరణించారు. తాజాగా మరో సీనియర్ నటి కూడా మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి రష్మీ జయగోపాల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఆమె ఊహించని విధంగా మరణించినట్టు తెలుస్తుంది.

సెప్టెంబర్ 18(ఆదివారం)న ఆమె మరణించగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలయాళ, తమిళ భాషల్లో రూపొందిన ఎన్నో సీరియల్స్ మరియు సినిమాల్లో ఈమె నటించింది. ఇప్పుడు ఆమె వయస్సు 51 సంవత్సరాలు. తన భర్త జయగోపాల్, కొడుకు ప్రశాంత్ కేశవ తో ప్రశాంతమైన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమె ఇలా మరణించడంతో సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.రష్మీ… బెంగుళూరులో పుట్టి పెరిగిన రష్మీ జయగోపాల్..

మొదట కమర్షియల్ యాడ్స్ లో నటించేది. ఆ తర్వాత మలయాళం, తమిళ భాషలలో టీవీ సీరియల్స్ ద్వారా నటిగా మారింది. పలు సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇటీవల రష్మీ తిరువనంతపురంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి రాగానే అనారోగ్యం పాలయ్యిందట.దీంతో ఆమెను హాస్పిటల్లో చేర్చగా కొద్దిరోజులకే ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఇక రష్మీ మృతికి చింతిస్తూ.. తన సానుభూతిని తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus