Malli Pelli OTT: నరేష్, పవిత్ర ల.. ‘మళ్ళీ పెళ్లి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • June 20, 2023 / 01:31 PM IST

సీనియర్ నటుడు నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటించగా.. అతనికి జోడీగా సీనియర్ నటి పవిత్ర లోకేష్ నటించింది. ఈ మధ్య కాలంలో బోల్డ్ సినిమాలు తీస్తున్న ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ‘విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌’ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ,వనిత విజయ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

మే 26న (Malli Pelli) ఈ మూవీ విడుదల అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. నరేష్.. పవిత్ర జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనల ఆధారం చేసుకుని తీసిన కథ ఇది. అలా అని ఇది నిజం అనడానికి లేదు. జస్ట్ నరేష్ కోణంలో అలోచించి దర్శకుడు యం.యస్.రాజు తీసిన మూవీ అని చెప్పాలి.థియేటర్లలో ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రచారంలో కనిపించిన వేడి తర్వాత చల్లారిపోయింది.

నరేష్ – పవిత్ర ల సహజీవనం ఎలా మొదలైంది అనే కథని తెలుసుకోవడానికి ప్రేక్షకులు టికెట్ పెట్టలేదు. ఓటీటీలోనే చూడాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు లైట్ తీసుకున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. జూన్ 23 నుండీ ఈ మూవీ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడైనా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus