Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

నెల రోజుల వ్యవధిలో మూడు హిట్‌లు.. అందులోనూ అన్నీ బ్లాక్‌బస్టర్‌ విజయాలు.. ఒక్కోటి రూ.200 కోట్లకుపైగా వసూళ్లు అందుకున్న చిత్రాలు. ఇలాంటి రికార్డు ఏ హీరోయిన్‌కైనా వస్తుందా? కచ్చితంగా రాదు అనే సమాధానమే వస్తుంది. ఇలాంటి అదిరిపోయే రికార్డును అందుకుంది లేటెస్ట్ సౌత్‌ క్రష్‌ మమితా బైజు. ‘ప్రేమలు’తో యూత్‌ క్రష్‌గా మారిన మమిత ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మారింది. డబుల్‌ హండ్రెడ్‌ వసూళ్లను ఒకే నెలలో మూడు సార్లు అందుకుని బిగ్గెస్ట్‌ స్టార్‌ అయింది.

Mamitha Baiju

విజయ్ హీరోగా మమితా బైజు నటంచిన ‘జననాయగన్‌’ జులై 23న వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా రూ.240 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇక మలయాళంలో నివిన్‌ పౌలీతో కలసి నటించిన ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ ఆగస్టు 21న విడుదలై రూ.200 కోట్ల మార్క్‌ దాటింది.

దీంతో 30 రోజుల వ్యవధిలో ఆమె నుండి వచ్చిన మూడు సినిమాలు ఇలా విజయం సాధించడం ఆమె కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటోందో చెప్పొచ్చు. అలాగే మూడుకు మూడు సినిమాలు డిఫరెంట్‌ జోనర్‌, బ్యాక్‌డ్రాప్‌తో కథలు ఎంచుకుంటూ వస్తోంది. ఆమె జోరు ఇలానే కొనసాగితే మరిన్ని రికార్డులు సాధ్యం అనిపిస్తోంది.

అన్నట్లు ఈ మూడు డబుల్‌ సెంచరీలు కాకుండా.. మరో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అవే ‘ప్రేమలు’, ‘డ్యూడ్‌’. ఇందులో ‘ప్రేమలు’ సినిమాకు రూ.130 కోట్ల వసూళ్లు రాగా.. ‘డ్యూడ్‌’ సినిమాకు రూ. 110 కోట్ల వసూళ్లూ వచ్చాయి. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవే ‘ఇరండు వానమ్‌’, ‘హలో డియర్‌’తోపాటు ప్రదీప్‌ రంగనాథన్‌ నిర్మాణంలో చేస్తున్న మరో సినిమా కూడా ఉంది.

స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus