ఫ‌న్‌రైడ‌ర్‌గా ‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైల‌ర్!

  • May 25, 2021 / 12:49 PM IST

శ్రీ‌నివాస్‌రెడ్డి, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్నఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ రోజు `ముగ్గురు మొన‌గాళ్లు` ట్రైల‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

2.15నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం న‌వ్వులు పూయించింది. శ్రీనివాసరెడ్డికి విన‌ప‌డ‌దు, దీక్షిత్‌ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ట్రైల‌ర్‌లో వీరు ముగ్గురు క‌లిసి చేసే అల్ల‌రి క‌డుపు చ‌క్క‌లయ్యేలా న‌వ్వించింది. ఇక అనుకోకుండా వ‌రుస హత్య‌ల‌కేసులో వీరు ముగ్గురు ఇరుక్కోవ‌డం త‌ర్వాత ఆ కేసుని వీళ్లు ఛేదించాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం లాంటి అంశాలు థ్రిల్లింగ్‌గా ఉండ‌డంతో పాటు సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశాయి. గ‌రుడ‌వేగ అంజి విజువ‌ల్స్‌, సురేష్ బొబ్బిలి సంగీతం, చిన్న నేపేథ్య సంగీతం ట్రైల‌ర్‌ను మ‌రో రెంజ్‌కి తీసుకెళ్లాయి. మొత్తానికి ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.


10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus