రామ్‌చరణ్ మల్టీస్టారర్ మూవీ చేయడం లేదు.!

  • May 18, 2018 / 05:11 AM IST

రంగస్థలం సినిమాతో మెగాపవర్‌ స్టార్ రామ్‌ చరణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా నటించి 200 కోట్లు కొల్లగొట్టారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ద్విగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్ మీద ఉండగా చరణ్ ఓకే చెప్పిన మరో సినిమా పేపర్ మీద రూపుదిద్దుకుంటోంది. అదే రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న మల్టీ స్టారర్ మూవీ. ఈ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి.

అయితే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌ తో కలిసి చరణ్ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి. అతను నటించిన మహానటి తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతోంది. జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్‌ చేసిన నటనకు అభినందనలు కురుస్తున్నాయి. కాబట్టి కేయస్ రవీంద్ర  దుల్కర్ సల్మాన్‌ , చరణ్ లతో మూవీ తెరకెక్కించనున్నట్లు వార్త కోలీవుడ్ లో తెగ చక్కర్లు కొట్టింది. ఈ వార్తపై దుల్కర్ సన్నిహితులు స్పందించారు. దుల్కర్ ఎలాంటి మల్టీస్టారర్ సినిమాకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. దీంతో రామ్‌చరణ్, దుల్కర్ తో మల్టీస్టారర్ మూవీ చేయడం లేదని అర్ధమయింది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus