తమన్ కాదు.. దేవి కాదు.. మరెవరు?

  • February 21, 2020 / 06:37 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి తన సినిమాల విషయంలో ఏమైనా కలిసొస్తే.. ఎక్కువగా దానినే ఫాలో అవుతూ ఉంటాడు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో..! కెరీర్ ప్రారంభంలో మణిశర్మతో ఎక్కువగా తన సినిమాలకి మ్యూజిక్ చేయించుకునే వాడు. ‘ఖలేజా’ వరకూ మణిశర్మనే కొనసాగిస్తూ వచ్చాడు. కానీ ‘దూకుడు’ దగ్గర్నుండీ దూరం పెట్టాడు. ఆ తరువాత తమన్ తో 3 సినిమాలకు మ్యూజిక్ చేయించుకున్నాడు. అటు తరువాత దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పటి నుండీ బ్యాక్ టు బ్యాక్ హిట్లు దక్కాయి మహేష్ కి..! దీంతో ఇప్పటివరకూ వరుసగా అతని సినిమాలకి దేవిని పెట్టుకుంటూ వచ్చాడు.

‘1 నేనొక్కడినే’ సినిమా డిజాస్టర్ అయినా ఆ చిత్రం పాటలు హిట్ అయ్యాయి. ఇక ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా వరుస సినిమాలు హిట్లవ్వడంతో తన తరువాతి 27వ చిత్రానికి కూడా దేవి నే అనుకున్నారు. కానీ తమన్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తమన్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ సినిమాని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈక్రమంలో అనిరుథ్ పేరు వినిపిస్తుంది. అయితే తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు అనిరుథ్ సంగీతం అందించగలడా.. అని చిత్ర యూనిట్ సభ్యులకి మరో అనుమానం అట. దీంతో మణిశర్మ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారట. మరి చివరికి దిల్ రాజు అండ్ టీం ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus