సైలెంట్ గా బడా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్న అగ్ర నిర్మాణ సంస్థ!

  • October 29, 2022 / 04:51 PM IST

2015 కి ముందు వరకు అగ్ర నిర్మాణ సంస్థలు అంటే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్'(దిల్ రాజు), ‘గీతా ఆర్ట్స్'(అల్లు అరవింద్), ‘సురేష్ ప్రొడక్షన్స్'(సురేష్ బాబు) బ్యానర్లే అనే నమ్మకం జనాల్లో ఉండేది. అయితే ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ తో ఒక్కసారిగా రాకెట్ లా దూసుకొచ్చింది ‘మైత్రి మూవీ మేకర్స్’. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్లో టాప్ బ్యానర్ గా ఎదిగింది. స్టార్ హీరోలందరూ ‘మైత్రి’ వారితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అలాగే అగ్ర హీరోలు,ద‌ర్శ‌కులు, హీరోయిన్లంద‌రికీ ‘మైత్రీ’ వారు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేస్తున్నారు. చిరు, బాలయ్య, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో పాటు విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ వంటి మిడ్ రేంజ్ హీరోలు ఇలా అందరూ ‘మైత్రి’ లోనే సినిమాలు చేస్తున్నారు. ఆఖరికి విజయ్, సల్మాన్ ఖాన్ వంటి పక్క భాషల్లోని స్టార్ హీరోలను కూడా లాక్ చేసేసింది మైత్రి. అయితే ఇప్పుడు మ‌రో నిర్మాణ సంస్థ కూడా ‘మైత్రి’ లానే దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది.

అదే ‘పీపుల్స్‌ మీడియా ఫ్యాక్ట‌రీ’. సైలెంట్ గా ఈ సంస్థలో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఆల్రెడీ ‘కార్తికేయ2’ బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రభాస్- మారుతి కాంబినేషన్లో రూపొందే మూవీ ఈ బ్యానర్లోనే రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందే మూవీ కూడా ఈ బ్యానర్లోనే రూపొందుతుంది. రవితేజ తో ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు.గోపీచంద్ తో కూడా ఓ క్రేజీ మూవీ నిర్మిస్తున్నారు.

స్టార్ హీరోలకు కూడా అడ్వాన్స్ లు ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. ఇప్పటివరకు 10 మంది పెద్ద హీరోలకు అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేశారట. ఓ బాలీవుడ్ స్టార్ హీరోతోనూ కూడా సినిమా చేసే అవకాశం ఉంది. సైలెంట్ గా టాప్ హీరోలు, దర్శకులందరినీ ప్యాక్ చేసే పనిలో పడ్డారు ‘పీపుల్స్ మీడియా’ వారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus