‘బాహుబలి’ నటుడితో నాగ్ అశ్విన్ వెబ్ సిరీసా..?

  • March 18, 2020 / 06:37 PM IST

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ఎవ్వరూ ఊహించని విధంగా ఇప్పుడు ప్రభాస్ తోనే సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు. ఇదిలా ఉంటే.. ఈ డైరెక్టర్ ‘బాహుబలి’ నటుడితో పాన్ ఇండియా వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొంపతీసి ప్రభాస్ తో వెబ్ సిరీస్ కానీ తీస్తున్నాడా? బాహుబలి నటుడు అంటున్నాడు.. మళ్ళీ పాన్ ఇండియా స్టార్ అంటున్నాడు.. అని కంగారు పడకండి. వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది ప్రభాస్ తో కాదు మన బల్లాల దేవుడు రానాతో.

అవును రానా కూడా బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతకు ముందు కూడా హిందీలో పాపులర్ అయ్యాడు అనుకోండి. ‘బాహుబలి’ తరువాత అతని రేంజ్ పెరిగింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ వెబ్ సిరీస్ చేయడానికి రానా రెడీ అవుతున్నాడని సమాచారం. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందబోతుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ తో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు నాగ్ అశ్విన్. ఇది పూర్తయిన తర్వాత ఈ వెబ్ సిరీస్ ఉంటుందని తెలుస్తుంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus