విక్రమ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్న నాగచైతన్య!

  • December 7, 2017 / 07:15 AM IST

మనం.. అక్కినేని ఫ్యామిలీకి అపురూప జ్ఞాపకం. ఇంతటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన డైరక్టర్ విక్రమ్ కె కుమార్. ఈ డైరక్టర్ 24 సినిమాతో దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. తన టేకింగ్ అందరూ ఫిదా అయిపోయారు. అందుకే అక్కినేని నాగార్జున తన కొడుకు అఖిల్ ని విక్రమ్ దర్శకత్వంలోనే రీ లాంచ్ చేస్తున్నారు. విక్రమ్, అఖిల్ కలయికలో తెరకెక్కిన హలో ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈనెల 10 న జరగనుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన అక్కినేని నాగార్జున ఆసక్తికర సంగతి వెల్లడించారు. “హలో సినిమాపై తాము పూర్తి నమ్మకంతో ఉన్నాము. విక్రమ్ మీద నమ్మకంతో నాగచైతన్య తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ హలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం తర్వాత అతను ఒక సినిమా కమిట్ అయి ఉన్నారు. ఆ తర్వాత నాగచైతన్య తో సినిమా చేస్తామని మాట ఇచ్చారు.” అని వివరించారు. విక్రమ్ దర్శకత్వంలో చైతూ మనం సినిమాలో నటించారు. అది సూపర్ హిట్. సో రెండో ప్రాజెక్ట్ పై సహజంగానే అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం చైతూ చందూ మొండేటి తో    “సవ్యసాచి” అనే సినిమాని చేస్తున్నారు. టైటిల్, ప్రీ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus