Nagarjuna: ప్రసన్న ఫస్ట్.. మోహన్ రాజా నెక్స్ట్.. ఇదిగో క్లారిటీ..!

  • December 11, 2022 / 01:24 PM IST

‘బంగార్రాజు’ ‘బ్రహ్మాస్త్రం’ ‘ఘోస్ట్’ వంటి చిత్రాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. మొదటి రెండు సినిమాలు బాగా ఆడాయి కానీ ‘ఘోస్ట్’ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాత చేయబోయే సినిమాల పై చాలా శ్రద్ధ పెట్టాడు.. నాగార్జున. మోహన్ రాజా నాగార్జునకి ఓ కథ వినిపించాడు. ఇది నాగార్జునకి నచ్చింది. కానీ ఇందులో మెయిన్ రోల్లో అఖిల్ అక్కినేని కనిపించబోతున్నాడట. నాగ్ ది కీలక పాత్ర అని తెలుస్తుంది. ఇది వందో సినిమా ప్రకటించబోతున్నట్లు మొన్నామధ్య కథనాలు వినిపించాయి.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు.. గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మోహన్ రాజా ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తాడు కాబట్టి.. ఈ సినిమా కూడా రీమేక్ అయ్యి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. కానీ అసలు రీమేక్ జోలికి పోకుండా ఈ మూవీని సెట్ చేస్తున్నారని వినికిడి. అయితే నాగ్ ఈ ప్రాజెక్టుని వెంటనే స్టార్ట్ చేయరట..! కొంతకాలం ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టబోతున్నారట. ముందుగా ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట.

సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే,పాగల్, ధమాకా… సినిమాలకి రైటర్ గా పనిచేసిన ప్రసన్న కుమార్ నాగ్ కు ఓ కథ వినిపించాడు.నాగ్ ఈ కథని వెంటనే ఓకే చేశారు. ఇది పీరియాడిక్ డ్రామా అని కథనాలు మొదలయ్యాయి. అందులో నిజం లేదు ఇది పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అని మరి కొంతమంది అంటున్నారు.

ఈ విషయం పై ప్రసన్న కుమార్ క్లారిటీ ఇచ్చాడు. ”నాగార్జున గారితో రంగ్ దే బసంతి స్టైల్లో పీరియాడిక్ డ్రామాగా… ఓ సినిమా చేయబోతున్నాను.ఇలా చెబితే అందరూ ఆ సినిమాకు రీమేక్ అని రాసేశారు. ప్రస్తుతం కథ పై వర్క్ చేస్తున్నా. త్వరలోనే ప్రకటన ఉంటుంది” అంటూ క్లారిటీ చెప్పుకొచ్చాడు ప్రసన్న.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus