Namrata: సుధామూర్తి చూపించే అభిమానం మరవలేనిది.. నమ్రత పోస్ట్ వైరల్!

  • July 16, 2024 / 05:04 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు (Mahesh Babu) నమ్రత క్యూట్ కపుల్ అని ఇండస్ట్రీలో అందరూ భావిస్తారు. వయస్సులో మహేష్ బాబు కంటే నమ్రత పెద్ద అనే సంగతి తెలిసిందే. మహేష్, నమ్రతల కొడుకు కూతురు సినిమా ఎంట్రీ గురీంచి ఈ మధ్య కాలంలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత తాజాగా చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంబానీ ఇంట అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకకు నమ్రత హాజరు కాగా ఇన్ఫోసిస్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తితో కలిసి నమ్రత ఫోటో దిగారు. ఆ ఫోటోను నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సుధామూర్తి.. ఈ ఆదర్శ మహిళ గురించి వినడమే కానీ ఎప్పుడూ కలవలేదు.. తొలిసారి ఇప్పుడే కలిశాను.. ఈ క్షణం నా లైఫ్ లో ఎప్పటికీ మరిచిపోలేను.. సుధామూర్తి మా ముత్తాత, మహేష్, సితార గురించి చెబుతుంటే ఎంతో సంతోషంగా అనిపించిందని నమ్రత వెల్లడించారు. సుధామూర్తి చూపించే అభిమానం ఎప్పటికీ మరవలేనిది అని నమ్రత అన్నారు. నమ్రత చేసిన ఈ పోస్ట్ కు లక్షల్లో లైక్స్ వచ్చాయి.

నమ్రతకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 5.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణులు చాలా తక్కువమంది ఉన్నారు. మహేష్ బాబు తరపున సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఎంతోమంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించి నమ్రత వార్తల్లో నిలిచారు. సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే లేనట్టేనని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus