Balakrishna: అన్న కొడుకు కోసం బాలయ్య మరోసారి ప్రత్యేక పూజలు

  • February 13, 2023 / 08:19 PM IST

నందమూరి తారకరత్న … నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని వెంటనే కుప్పంలోని కేసి ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి మరింత క్రిటికల్ గా మారడంతో తారకరత్నని వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అక్కడి వైద్య బృందం తారకరత్నకు మెరుగైన వైద్యం అందించడంతో పెద్ద ప్రమాదం నుండి తారకరత్న బయటపడ్డారు. ఆయన అవయవాల తీరు మెరుగుపడటంతో ఆయన త్వరగా కోలుకుంటారు అని అంతా అనుకున్నారు.

కానీ మెదడు పనితీరు ఇంకా మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో తారకరత్న మెదడుకి స్కానింగ్ చేసి విదేశాలకు పంపడం జరిగింది. అంతేకాక విదేశాల నుండి వైద్యులు వచ్చి తారకరత్నకు చికిత్స అందించబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తారకరత్న చెవిలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రాలు చెబుతున్నారట. తన అన్న కొడుకు కోలుకోవాలని బాలయ్య నిద్రాహారాలు మానేసి మరీ హాస్పిటల్ వద్ద పడుంటున్న సందర్భాలు ఉన్నాయి. తారకరత్న కుప్పలోని హాస్పిటల్ చేరి స్పృహ కోల్పోయినప్పుడు బాలయ్య..

అతని చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పారట. దీంతో అతని శరీరం ట్రీట్మెంట్ కు సహకరించడం మొదలుపెట్టినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే చిత్తూరులో ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు,హోమాలు జరిపించడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు తారకరత్నకు విదేశీ వైద్యులు ట్రీట్మెంట్ మొదలుపెడుతున్న తరుణంలో మరోసారి తారకరత్న చెవిలో మరోసారి బాలయ్య మృత్యుంజయ మంత్రాలు చదివినట్టుగా తెలుస్తుంది.

నందమూరి బాలకృష్ణకి విపరీతమైన దైవ భక్తి ఉంది.కుటుంబం బాగోగుల కోసం కూడా ఆయన ప్రత్యేక పూజలు వంటివి జరిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తారకరత్న కోసం అన్ని విధాలుగా ఆయన భక్తిని చాటుకున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus