గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి నందీత శ్వేత!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించి నేడు గచ్చిబౌలి లో మొక్కలు నాటిన తెలుగు, కన్నడ, తమిళ సినిమాల హీరోయిన్ నందీత శ్వేత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి తెలుసుకోని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా చాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని. ఈ రోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ చాలెంజ్ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో నిఖిల్, సినిమా కల్కి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus