గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి నందీత శ్వేత!

  • January 25, 2021 / 01:24 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించి నేడు గచ్చిబౌలి లో మొక్కలు నాటిన తెలుగు, కన్నడ, తమిళ సినిమాల హీరోయిన్ నందీత శ్వేత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి తెలుసుకోని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా చాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని. ఈ రోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ చాలెంజ్ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో నిఖిల్, సినిమా కల్కి సినిమా డైరెక్టర్ ప్రశాంత్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus