డ్రగ్ నోటీసులపై స్పందించిన నవదీప్

  • July 15, 2017 / 12:06 PM IST

తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌‌ కొంతమంది సినీ తారల పేర్లు బయటపెట్టడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారు. ఇప్పటి వరకు 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు,  చార్మీ, ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్) పేర్లు ఉన్నట్లు సమాచారం.

ఈ వార్తలను కొంతమంది ఖండించగా, మరికొంతమంది మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నవదీప్ ని ప్రశ్నించగా సిట్‌ నుంచి తనకు నోటీసులు అందిన మాట వాస్తవమేనని అంగీకరించారు. విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. కెల్విన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా ఎక్సైజ్‌ విచారణకు పూర్తిగా  సహకరిస్తానని నవదీప్‌ చెప్పారు. ఈ కేసులో తనకు ఏ సంబంధం లేదనే విషయాన్నీ నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus